న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. కారు యాక్సిడెంట్లో తీవ్ర గాయాలపాలై రెండేళ్లుగా క్రికెట్కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు చేపట్టాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ మంగళవారం వెల్లడించింది. ‘రిషబ్ను మళ్లీ మా కెప్టెన్గా స్వాగతిస్తున్నాం. నూతన అభిరుచి, శక్తి, ఉత్సాహంతో అతను మరోసారి మా జట్టును నడిపించడాన్ని చూడటానికి ఎదురుచూస్తున్నాను’ అని ఫ్రాంచైజీ చైర్మన్ పార్త్ జిందాల్ తెలిపారు. ఫ్రాంచైజీ ఎక్స్ హ్యాండిల్ ‘వెల్కమ్ బ్యాక్ కెప్టెన్ రిషబ్ పంత్’ అంటూ పోస్ట్ చేసింది. అలాగే, ర్యూబిక్స్ క్యూబ్లతో పంత్ ముఖాన్ని తయారు చేసిన వీడియోను పోస్ట్ చేసింది. 2021లో తొలిసారిగా ఢిల్లీ పగ్గాలు చేపట్టిన పంత్.. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో గతేడాది సీజన్కు దూరమైన విషయం తెలిసిందే. గత సీజన్లో డేవిడ్ వార్నర్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/rishabh-pant.jpg)