25మీ. స్పోర్ట్స్ పిస్టల్ క్వాలిఫికేషన్
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ ట్రయల్స్లో 19ఏళ్ల ఈషా సత్తా చాటింది. డా. కర్ణి సింగ్ రేంజ్లో శుక్రవారం జరిగిన మహిళల 25మీ. స్పోర్ట్స్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్లో ఈషా 294పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలతో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక సిమ్రన్ప్రీత్ కౌర్ ర్యాపిడ్లో 295పాయింట్లతో సహా మొత్తం 583పాయింట్లతో రెండోస్థానంలో నిలువగా.. మను బకర్, అభిన్యా పాటిల్ ఆ తర్వాతి స్థానాలో ఉన్నారు. ఇక పురుషుల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో భావేష్ షెకావత్(580పాయింట్లు) టాప్లో ఉండగా.. ఆ తర్వాత విజరువీర్ సిద్ధూ(579), అనీష్ భన్వాలా(578) టాప్ా3లో నిలిచారు. ఇక పురుషుల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఫైనల్ శనివారం జరగనుంది. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నలుగురికి ఒలింపిక్స్ బెర్త్లు దక్కనున్నాయి.