‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డు రేసులో నమీబియా, యూఏఈ కెప్టెన్లు

May 6,2024 18:00 #Awards, #Cricket, #icc, #Sports

ఏప్రిల్‌ నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్‌ చేసింది. ఈ లిస్ట్‌లో పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ పేసర్‌ షహీన్‌ అఫ్రిది, నమీబియా కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌, యూఏఈ కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీమ్‌ ఉన్నారు.
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో అద్భుతంగా రాణించి ఎనిమిది వికెట్లు తీసిన ఆఫ్రిది ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు గెలిచాడు. దీంతో తన అద్భుత ప్రదర్శన కారణంగా షాహీన్‌ అఫ్రిది ఈ అవార్డు రేసులో నిలిచాడు. మరోవైపు మస్కట్‌లో నమీబియాపై 3-2తో సిరీస్‌ గెలవడంలో ఎరాస్మస్‌ కీలక పాత్ర పోషించాడు. సిరీస్‌లో 145 పరుగులు చేయడంతో పాటు ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఎరాస్మస్‌ రెండు మ్యాచుల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్నాడు. ఇలా అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు రేసులో ఉన్నాడు.
అలాగే యూఏఈ జట్టు కెప్టెన్‌ వసీమ్‌ ఒమన్‌లో జరిగిన ఏసీసీ ప్రీమియర్‌ కప్‌ను గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ సిరీస్‌లో భాగంగా బహ్రెయిన్‌పై అర్దశతకం (65), ఆ తర్వాత ఒమన్‌, కంబోడియాపై వరుసగా 45, 48 పరుగులు బాదాడు. ఇక ఒమన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచుల్లో మనోడు ఏకంగా సెంచరీ కొట్టాడు. ఇలా ఏప్రిల్‌ మాసంలో 44.83 సగటుతో 269 పరుగులు చేశాడు. దీంతో ఇప్పుడు ఐసీసీ పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు రేసులో నిలిచిన మొదటి యూఏఈ క్రికెటర్‌గా అవతరించాడు.

➡️