రితిక్‌కు రజతం

Apr 24,2024 22:12 #Sports

ఆసియా అండర్‌20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌
దుబాయ్: ఆసియా(అండర్‌20) అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ డిస్కస్‌ త్రో విభాగంలో భారత యువ అథ్లెట్‌ రితిక్‌ రాథీ రజత పతకంతో సత్తా చాటాడు. దుబారు వేదికగా బుధవారం జరిగిన పోటీల్లో రితిక్‌ డిస్కస్‌ త్రోలో 53.01మీ. విసిరి రెండోస్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో భారత్‌ నుంచి 60మంది అథ్లెట్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది జరిగిన ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ 6 స్వర్ణ పతకాలతో మూడోస్థానంలో నిలిచింది.

➡️