ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఫైనల్ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ భారత జట్టుకు ప్రపంచ కప్ను తెచ్చిపెట్టింది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతిని మిల్లర్ గాల్లోకి లేపగా.. అది నేరుగా బౌండరీ లైన్ అవతల పడేలా కనిపించింది. అయితే, బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ అద్భుతమైన ఫీల్డింగ్తో బంతిని అందుకున్నాడు. దీంతో డేవిడ్ మిల్లర్ పెవిలియన్కు వెళ్లాడు. దీంతో మ్యాచ్లో భారత్ గెలిచింది.