అధ్వానంగా పాలకొల్లు రైల్వే గేటు రోడ్డు

Nov 27,2023 22:30

వాహనదారుల అవస్థలు
పట్టించుకోని అధికారులుఅధ్వానంగా పాలకొల్లు రైల్వే గేటు రోడ్డు
ప్రజాశక్తి – పాలకొల్లు
           పాలకొల్లు రైల్వే గేటు వద్ద ప్రధాన రోడ్డు చెరువులా మారింది. దీంతో పాలకొల్లు-భీమవరం రోడ్డుపై ప్రయాణం నరకంగా మారింది. మున్సిపల్‌ అధికారులు రోడ్డుకు ఇరువైపులా డ్రెయిన్‌ నిర్మించకపోవడంతో ఆర్‌అండ్‌బి రోడ్డు అధ్వానంగా తయారైంది. పట్టణంలో ఇలాంటి రోడ్లు చాలానే ఉన్నాయి. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్డు చెరువులా మారింది. ఇక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ప్రజలు, వాహనదారులు క్షతగాత్రులై ఆసుపత్రిపాలవుతున్నారు. అయినా పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్విస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. ధ్వంసమైన పాలకొల్లు – భీమవరం రోడ్డుకు గ్రావెల్‌తో మరమ్మతులు చేశారు. వర్షం కురిసిన సమయంలో బురదగా మారి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే గేటు వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తారుతో మరమ్మతులు చేయకుండా పురాతన గ్రావెల్‌తో చేస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

➡️