ప్రజాశక్తి – నరసాపురం
భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి 60వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నరసాపురం పట్టణానికి చెందిన ఆదిపరాశక్తి నృత్య అకాడమీ ఉపాధ్యక్షులు రంగినీడి సుబ్బారావు, అడ్మినిస్ట్రేటివ్ భరణి ఆధ్వర్యంలో ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అన్నమయ్య కీర్తనలు, మహిషాసుర మర్ధిని స్తోత్రం, శివతాండవం, దీపాలు, పూర్ణ కలశాలతో ఆదిపరాశక్తి నృత్య అకాడమీ సంస్థ నాట్యాచారిణి, డైరెక్టర్, నాట్య సరస్వతి అవార్డు గ్రహీత అనంతలక్ష్మి శిష్య బందం చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అనంతలక్ష్మిని నీరుల్లి, కూరగాయ, పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు గోవిందరావు పట్టు వస్త్రాలతో సత్కరించి ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థినులకు ధృవ పత్రాలు అందజేసి అభినందించారు.