ఎబిఎస్‌వికెలో ఉచిత వైద్య శిబిరం

భీమవరం రూరల్‌

భీమవరం మెంటేవారితోట అల్లూరి సీతారామరాజు భగత్‌సింగ్‌ సేవా విజ్ఞాన కేంద్రంలో మంగళవారం గుండెవైద్య నిపుణులు డాక్టర్‌ విక్రమ్‌ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్‌ క్యాంప్‌ను మంగళవారం నిర్వహించారు. ప్రతినెలా ఆఖరి మంగళవారం ఈ క్యాంపు జరుగుతుందని వసుధ పౌండేషన్‌ కో ఆర్డినేటర్‌ ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. ఈ క్యాంపు పేద కుటుంబాలకు చెందిన చిన్నపిల్లలకు ఎంతగానో ఉయోగకరంగా ఉందన్నారు. ఈ క్యాంపులో గుండె ఆపరేషన్‌ అవసరమైన పిల్లలకు చికిత్స ఉచితంగా అందించడమే లక్ష్యంగా వసుధ ఫౌండేషన్‌, ఎస్‌ఎల్‌జి ఆసుపత్రి, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్‌ సేవా విజ్ఞాన కేంద్రం వారు సేవలందిస్తున్నారని, ఆ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం 32 మంది చిన్నారులకు 2డి ఎకో పరీక్షలు నిర్వహించారు.

➡️