దాడిపై జర్నలిస్టుల నిరసన ప్రదర్శన

Feb 20,2024 20:48

వినుకొండలో నిరసన ప్రదర్శన
ప్రజాశక్తి – వినుకొండ : అనంతపురం జిల్లా రాప్తాడులో సిఎం సభలో ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టుపై దాడిని నిరసిస్తూ నియోజకవర్గంలోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు మంగళవారం నిరసన తెలిపారు. స్థానిక శివయ్య స్తూపం వద్ద నుండి తహశీల్దార్‌ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని, ప్రతిరోజు ఎక్కడో చోట విలేఖరులపై దాడి పరిపాటైందని ఆవేదన వెలిబుచ్చారు. దాడి చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వై.బుజ్జి, ఎల్‌.వెంకట్రావు, ఎస్‌.కోటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, సోమయ్య పాల్గొన్నారు.

అమరావతిలో మానవహారం

ప్రజాశక్తి – అమరావతి : విలేకర్లపై దాడిని నిరసిస్తూ మండల కేంద్రమైన అమరావతిలో మండల జర్నలిస్టుల అసోసియేషన ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. తొలుత స్థానిక అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. తహశీల్దార్‌, పోలీస్‌స్టేషన్‌కు ప్రదర్శనగా వెళ్లి వినతిపత్రాలిచ్చారు. ప్రజాసేవలో అలుపెరుగకుండా పని చేస్తున్న విలేకర్లపై దాడులు దారుణమన్నారు. ఇందుకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. వీరికి పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపి ప్రదర్శనలో పాల్గొన్నారు.

➡️