ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండలంలోని శుక్రవారం జరిగిన అరుకు వారపు సంతలో పుట్ట గొడుగులకు గిరాకీ ఏర్పడింది. పుట్టుగొడుగులు రుచికరంగా ఉండటంతో ఎగబడిమరీ కొనుగోలు చేశారు. పుట్ట గొడుగుల ఒక్కో కవరు రూ.100లకు గిరిజనులు విక్రయించారు. అరకులోయ మండలంలోని నడిమివలస గ్రామానిక చెందిన ఓ గిరిజనుడు సంతలో పుట్ట గొడుగులను తీసుకొచ్చి విక్రయించాడు. అతడు స్వయం ఉపాధికి ఇంటి సమీపంలో పుట్ట గొడుగుల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాపుకొచ్చిన పుట్ట గొడుగులను కవరులో రూ.100ల చొపున విక్రయించాడు. మన్యం పుట్ట గొడుగుల్లో పోషకాలు ఉండడంతో కొనుగోలు చేశారు.