పోషకాహారం పంపిణీ

Nov 25,2023 18:19
కిట్లు అందజేస్తున్న దృశ్యం

కిట్లు అందజేస్తున్న దృశ్యం
పోషకాహారం పంపిణీ
ప్రజాశక్తి -పొదలకూరు : పొదలకూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంay శనివారం క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ప్రసాద్‌ తెలిపారు. డిఎంహెచ్‌ఒ, అడిషనల్‌ డిఎంహెచ్‌ఒ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్యులు మల్లికార్జున, గైనకాలజిస్ట్‌ పద్మావతి, టీబీ యూనిట్‌ పర్యవేక్షకులు సుధాకర్‌, శబరినాధ్‌, ల్యాబ్‌ టెక్నిషియన్‌ బోజి, ఆరోగ్య పర్యవేక్షకురాలు మస్తానమ్మ, ఆరోగ్య సహాయకులు కామాక్షమ్మ, వెంకటేశ్వర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️