ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలో మోద కొండమ్మ జాతర మహౌవాన్ని మే 26, 27,28 తేదీల్లో నిర్వహించేందుకు గ్రామ పెద్దలు, వర్తక సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. మోదకొండమ్మ ఉత్సవాలకు గౌరవ అధ్యక్షులు గా సర్పంచ్ పూర్ణిమ, ఎంపీటీసీ కొమ్మ రమ, ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా పాంగి అనిల్, ఉపాధ్యక్షులుగా కొర్ర నాగబాబు, ప్రధాన కార్యదర్శిగా బొడ్డేటి శివ, నానాజీ, ట్రెజరర్గా కడిమి శెట్టి.ప్రసాద్, సహాయ ట్రెజరర్గా కోడిదాసు గోవింద్, సహాయ కార్యదర్సులుగా కొర్ర కాసులమ్మ, పాడి వెంకట్, ప్రధాన కమిటీ సభ్యులుగా బద్నాయిని నూకరాజు, మీసాల నాగరాజు ఎన్నికయ్యారు.