రూ.5.52 లక్షల బయో ఉత్పత్తుల స్వాధీనం

Jan 19,2024 01:12

స్వాధీనం చేసుకున్న మందులతో అధికారులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి :
అనుమతుల్లేకుండా పురుగు మందులు బయో స్టిమ్లెంట్స్‌ వివిధ పార్శిల్‌ కంపెనీల వాహనాల ద్వారా గుంటూరుకు తెప్పించి రవాణ చేస్తుండగా రూ.5.52 లక్షల సరుకును విజిలెన్సు అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎఎన్‌ఎల్‌ పార్మిల్‌ ద్వారా సింజెంటా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన సిమోడిస్‌ పురుగు మందు 125 లీటర్లు స్వాదీనం చేసుకున్నారు. తెలంగాణలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి వినుకొండకు సరఫరా చేసేందుకు సిద్ధం చేస్తుండగా రూ.3.32 లక్షల సరుకు పట్టుకుని శివకృష్ణ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సింధూ పార్సెల్‌ ఆఫీసులో రూ.2 లక్షల విలువైన 210 లీటర్ల గ్లోబస్‌ అనే బయో పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖాధికారి రమణకుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ శ్రీహరిరావు, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

➡️