శ్రీలంక టెస్టు కెప్టెన్‌గా ధనంజయ డి సిల్వా

Jan 4,2024 11:00

ఇటీవలే వన్డే, టీ20లకు ఇద్దరూ వేర్వేరు కెప్టెన్లను శ్రీలంక క్రికెట్‌ బోర్డు టెస్టులకు కొత్త కెప్టెన్‌ను నియమించింది. టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌ ధనంజయ డి సిల్వాను శ్రీలంక క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. అదే విధంగా అతడికి డిప్యూటీగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ వ్యవహరించనున్నాడు. కొత్త కెప్టెన్‌గా ఎంపికైన ధనంజయ డి సిల్వా 51 టెస్టుల్లో 39.77 సగటుతో 3,301 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 10 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా టెస్టుల్లో అతడికి 34 వికెట్లు కూడా ఉన్నాయి.

➡️