సంక్షేమంలో సిఎం సరికొత్త చరిత్ర

Nov 24,2023 22:02
ఫొటో : మాట్లాడుతున్న జెసిఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సిహెచ్‌ ఆదిశేషయ్య

ఫొటో : మాట్లాడుతున్న జెసిఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సిహెచ్‌ ఆదిశేషయ్య
సంక్షేమంలో సిఎం సరికొత్త చరిత్ర
– జెసిఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సిహెచ్‌ ఆదిశేషయ్య
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారని ఆత్మకూరు జెసిఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సిహెచ్‌ ఆదిశేషయ్య అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ బి.నాగేశ్వరావు ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ అధ్యక్షతన శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని ఎసిఎస్‌ఆర్‌ కాలనీ సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జెసిఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సిహెచ్‌.ఆదిశేషయ్య మాట్లాడుతూ సిఎం జగన్‌మోహన్‌ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతిఒక్కరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. అలాగే స్థానిక ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మంచి ఆలోచనతో నియోజవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కాబట్టి ఆయన గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషి చేసి మళ్లీ ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి గెలిపించుకోవాలని కోరారు. అనంతరం సచివాలయ పరిధిలో పార్టీ జెండాను ఆవిష్కరించి, స్థానిక 17, 19, 20 వార్డుల్లో ఇళ్లను సందర్శించి ప్రజలకు అందుతున్న పథకాల గురించి వివరించారు. అక్కడి ప్రజలు తమకు అందుతున్న పథకాలపై ఆనందం వ్యక్తం చేస్తూ రాబోవు ఎన్నికల్లో జగన్‌ మోహన్‌ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. అనంతరం 19వ వార్డులోని ముఖ్య నాయకుడు బంకా వెంకటేశ్వర్లు రెడ్డి గృహంలో వార్డు ముఖ్య నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలి అనే అంశంపై చర్చించి వారి మద్దతు కోరారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో ప్రజలు జగన్‌ మోహన్‌ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించి ఆయనకు బ్రహ్మరథం పట్టడం ఖాయమన్నారు. తాము కూడా జగన్‌ మోహన్‌ రెడ్డి గెలుపునకు నిర్విరామంగా కృషి చేస్తామని, జగన్‌మోహన్‌రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఆనందంతో తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనంద్‌ రెడ్డి, యువనాయకులు నోటి వినరు కుమార్‌ రెడ్డి, పట్టణ పార్టీ ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, వలంటీర్లు, గృహసారథులు, తదితరులు పాల్గొన్నారు.

➡️