సజావుగా జరిగేందుకు చర్యలు

పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఎన్నికలు

ప్రజాశక్తి-పాడేరు: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయ సునీత స్పష్టం చేసారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములను, కౌంటింగ్‌ కేంద్రాలను అరకు, పాడేరు రిటర్నింగ్‌ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎటువంటి అపోహలకు తావు లేకుండా అన్ని భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటింగ్‌ ముందు రోజు ఎన్నికల సామగ్రి పంపిణీ చేయాల్సిన విధానం, కౌంటింగ్‌ ఏర్పాట్లపై పలు సూచనలు తెలియజేశారు. ఈ పరిశీలనలో పాడేరు రిటర్నింగ్‌ అధికారి, జేసి భావన వశిస్ట్‌, అరకు రిటర్నింగ్‌ అధికారి, ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి వి.అభిషేక్‌, ప్రత్యేక ఉప కలెక్టర్‌ పి.అంబేద్కర్‌, గిరిజన సంక్షేమ ఇఇ డివిఆర్‌ఎం రాజు, సర్వే అండ్‌ లాండ్స్‌ అధికారులు, స్థానిక తహసిల్దార్‌ కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.

➡️