సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి

Mar 25,2024 22:55
గిరిజనులతో మాట్లాడుతున్న సిపిఎం నేతలు

ప్రజాశక్తి -అనంతగిరి: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అరకు పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీపీఎం జెడ్పీటీసీ దీసరి. గంగరాజు, టోకురు సర్పంచ్‌ కిల్లో మొస్యలు కోరారు. టోకురు పంచాయతీ దొరగుడ, బల్యగుడ, కాశిపట్నం పంచాయతీ పల్లంవలస, కాటురు, సార్వనీపాలేం, చిలకగెడ్డ గ్రామాల్లో పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు మాట్లాడుతూ తాగునీరు, రోడ్లు, పోడు భూమి పట్టాలు వంటి సమస్యలు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. నాయకులు మాట్లాడుతూ, సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజల పక్షాన ఉంటూ నిరంతరం సమస్యలపై పోరాటం చేసే నాయకులను గెలిపిస్తే చట్టసభల్లో గలం వినిపిస్తారని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పాటుపడని ఇతర నాయకులు ఎన్నికల వేళలో ఓట్లు కోసం గ్రామాలకు నిలదీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు జి .దేవన్న, సింగులు, కృష్ణ పాల్గొన్నారు.

➡️