సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి

సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌: గిరిజన హక్కులు, చట్టాల రక్షణకై నిరంతరం పోరాటం చేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. గురువారం మండలంలోని గన్నెల పంచాయితీ మారుమూల గ్రామాలైన చిడివలస, సభక, కెంటిబడి గ్రామలలో సిపిఎం నాయకులు పర్యటించారు. అరకు సిపిఎం అసెంబ్లీ, పార్లమెంట్‌ అభ్యర్థులను గెలిపించాలని విస్తతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, నాయకులు పాంగి రామన్న మాట్లాడుతూ, నిరంతరం ప్రజల పక్షాన ఉండి గిరిజన హక్కుల చట్టాలు కోసం పోరాడే సిపిఎం బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి చట్టసభలకు పంపించాలని కోరారు. అటవీ సంపదను కాపాడాలంటే సిపిఎం అభ్యర్థులను చట్టసభలకు పంపించాలని కోరారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమిలను ఓడించాలని పిలుపునిచ్చారు. .జిఓ 3 రద్దు చేయడంతో గిరిజన ప్రాంత యువతీ యువకులు తీవ్రంగా అన్యాయమై పోయారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి.గాసి అప్పలస్వామి, ఎస్‌ రాజారావు, ఎస్‌ సీతన్న, ఎస్‌.అప్పలరాజు, సుబ్బారావు పాల్గొన్నారు.

➡️