రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన ప్రజాశక్తి-కడియం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి, వైసిపి రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు అన్నారు. కడియం ఆకుల సుబ్బారావు నర్సరీ నుంచి జాతీయ రహదారి వరకు నిర్మించే సిసి రోడ్ల నిర్మాణ పనులకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ నియోజక వర్గంలో అంతర్గత రహదారుల అభివద్ధి వేగవంతం చేస్తున్నామన్నారు. నియోజక వర్గంలో స్వచ్ఛత మన అందరి బాధ్యత లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత నివ్వాలని మంత్రి సూచించారు. ఇప్పటికే మెరుగైన పారిశుధ్యం దిశగా చర్యలు చేపట్టి నియోజకవర్గంలో పలు మురుగు నీటి డ్రైనేజీలను రూ.3.5 కోట్లతో శంఖుస్థాపన చేసుకున్నామన్నారు. రూరల్ నియోజక వర్గంలో రహదారుల అభివద్ధి, డ్రైనేజీ, మంచినీటి, పైపులైన్లు, వీధి దీపాల ఏర్పాటు, పార్కుల సుందరీకరణ తదితర మౌలిక వసతుల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రాజ్ మనోజ్, వైసిపి నాయకులు గిరజాల బాబు, వై.స్టాలిన్, నర్సరీ సంఘం అధ్యక్షుడు మల్లు పోలరాజు, డాక్టర్ అనసూరి పద్మలత, తిరుమల శెట్టి శ్రీను, లావేటి రమేష్, ఊటుకూరి శైలజ పాల్గొన్నారు.