ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఆర్య

Dec 31,2023 02:22

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 26 నుంచి 29వరకు కాకినాడ పట్టణంలో నిర్వహించారు. మహాసభల్లో నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆర్య రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 400మంది ప్రతినిధులు మహాసభకు హాజరయ్యారు. విద్యా రంగంలో వస్తున్న అనేక మార్పులపై చర్చించామని ఆర్య అన్నారు. విద్యావ్యవస్థలో రాబోతున్న సమస్యలపై పోరాటం చేసేందుకు, విద్యార్థుల సంక్షేమం కొరకు అనేక తీర్మానాలు చేశామని తెలిపారు. తనను రాష్ట్ర కమిటీలోకి మూడోసారి తీసుకోవడంపట్ల తనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు.

➡️