కళ్ళం వెంకటేశ్వరరావును గెలిపించాలి

Apr 19,2024 17:42

ప్రజాశక్తి-గన్నవరం
నియోజకవర్గంలో మౌలిక సౌకర్యాలకల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే ఎర్రజెండా అభ్యర్థి కళం వెంకటేశ్వరరావుకు ఓటు వేయాలని కోరుతూ శుక్రవారం గన్నవరంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వామ పక్ష నాయకులు మీరా ఖాన్‌, పఠాన్‌ సర్దార్‌, మిరప నాగేశ్వరరావు, దాదా, ఉడతా రామకృష్ణ, విజయరావు, వెంకటేశ్వరరావు, విఎన్‌ పురంలోనూ, గన్నవరంలో ఎన్‌. శ్రీనివాసరావు, మాదిరెడ్డి చిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. సుత్తీ, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. స్థానిక ప్రజలు, ఆయా కాలనీల కమిటీ నాయకులు నడిచారు. ఎర్రజెండా చూసి చాలా కాలం అయిందని, ప్రజల ఆదరణ, అభిమానం, ఆశీర్వాదం ఎన్నటికీ మరచిపోలేని మధురానుభూతి ఇస్తుందని పలువురు అన్నారు. తమ తోటి కార్మికుడు నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. బూర్జువా పార్టీలకు, కమ్యూనిస్టు పార్టీకి ఉన్న తేడా అదేనని నాయకులు పేర్కొన్నారు.

➡️