ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : శ్రేయాస్ మీడియా గ్రూప్, రాడిసన్ బ్లు రిసార్ట్ సంయుక్తంగా నూతన సంవత్సరం-2024 వేడుకలను ”ఎపిక్ ఈవెనింగ్” పేరుతో డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల నుండి సవాన లాన్ లో నిర్వహిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. శనివారం సాయంత్రం రాడిషన్ బ్లూ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రేయేష్ మీడియా ప్రతినిధులు రవికిరణ్, అభిషేక్ పాణిలు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ … నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుండి ప్రముఖులు హాజరవుతారని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వంటకాలతో నూతన సంవత్సర సాయంత్రాన్ని ఉల్లాసంగా గడిపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన టికెట్లను బుక్ మై షో, పేటీఎం ఇన్సైడ్ ద్వారా ఇప్పటికే విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆరోజు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రముఖ టాలీవుడ్ గాయని గాయకులు శృతి రంజని సాకేత్ లు పాల్గంటారని వీరితో పాటు డీజే డెంటి, మాస్టర్ చెర్రీ బ్యాండ్, చిన్నారి గాయని గాయకులు సాయి వేద వాగ్దేవి , మయుక్ లు పాల్గని అలరిస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.