వెస్ట్బ్యాంక్: గాజాలో ఇజ్రాయిల్ మారణకాండ, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో హింస పెరిగిన నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మహ్మద్ షతారు తన పదవికి రాజీనామా చేశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని ప్రాంతం పాలస్తీనా అథారిటీ పాలన కింద ఉన్నది. హతారు తన రాజీనామా లేఖను పాలస్తీనా అథారిటీ (పిఎ) అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్కు సోమవారం అందచేశారు. పాలస్తీనీయుల మధ్య ఐక్యతను విస్తరించడం గాజాలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కొత్త ప్రభుత్వం, రాజకీయ పొందికలు ఏర్పడాల్సిన అవసరం వుందని షతారు పేర్కొన్నారు. పాలస్తీనా అథారిటీ (పిఎ)ని పునర్వవ్యస్థీకరించాలని, యుద్ధం అనంతరం పాలస్తీనాను పాలించగల రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయాలంటూ అమెరికా అబ్బాస్పై ఒత్తిడిని పెంచుతున్న నేపథ్యంలో షతారు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.