నైజీరియాలోని ఈశాన్య బోర్నో రాష్ట్రంలో శనివారం ఆత్మాహుతి బాంబర్లు వరుస దాడులు చేశారు. ఈ దుర్ఘటనలో కనీసం 18 మంది చనిపోయారు. మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ బార్కిండో సైదు మాట్లాడుతూ.. ఆత్మాహుతి బాంబర్లు వేర్వేరు చోట్ల వరుస దాడులకు పాల్పడ్డారని చెప్పారు. గ్వోజా నగరంలో ఒక పెళ్లి, అంత్యక్రియలు, ఆసుపత్రిపై ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారని.. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 42 మంది గాయపడ్డారని తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.