న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్సిపి (శరద్ పవార్) అభ్యర్థులందరూ ఒకే గుర్తుపై పోటీ చేయనున్నారు. ఎన్సిపిలో చీలిక తీసుకొచ్చిన అజిత్ పవార్ గ్రూపునే ఎన్సిపిగా గుర్తించి, ‘గడియారం’ గుర్తును కూడా ఆ గ్రూపునకే కేటాయించిన ఎన్నికల సంఘం శరద్ పవార్ గ్రూపునకు ‘బూర ఊదుతున్న వ్యక్తి’ గుర్తు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడియారం గుర్తును ఎన్సిపి (అజిత్ గ్రూపు) ఉపయోగించకుండా నిరోధించాలని శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అందుకు నిరాకరించిన ధర్మాసనం ఈ ఎన్నికల్లో ఎన్సిపి (శరద్ పవార్) అభ్యర్థులందరూ ఒకే గుర్తు (బూరు ఊదుతున్న వ్యక్తి) వినియోగించుకునేందుకు అనుమతులు జారీ చేసింది. ఈ గుర్తును ఇతర పార్టీలకు, అభ్యర్థులకు కేటాయించకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్సిపి (శరద్ పవార్)కు మాత్రమే కేటాయించాలని ధర్మాసనం ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.