400 ఓ జోకు.. 200 సీట్లే కష్టం : శశిథరూర్‌ సెటైర్‌

May 3,2024 01:40 #BJP, #coments, #Shashi Tharoor

న్యూఢిల్లీ : ఈ లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని, మరోసారి మోడీ అధికారంలోకి వస్తారని బిజెపి నేతలు పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుస్తామని బిజెపి చెప్పడం ఒక జోక్‌. కాషాయ పార్టీకి ఈసారి ఎన్నికల్లో 300 సీట్లు రావడమే అసాధ్యం. కనీసం 200 స్థానాల్లో గెలవడం కూడా సవాలేనని శశిథరూర్‌ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో బిజెపి ఖాతా కూడా తెరవలేదు. 2019లో కంటే దక్షిణ భారత్‌లో బిజెపి దారుణంగా ఫెయిల్‌ అవుతుందన్నారు. కాగా, శశిథరూర్‌ తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. రెండవ దశలో ఈ నియోజకవర్గానికి పోలింగ్‌ జరిగింది. ఇక్కడి నుంచి బిజెపి తరఫున కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, సిపిఐ నుంచి పి. రవీంద్రన్‌ పోటీ చేశారు.

➡️