న్యూఢిల్లీ : ఇండియా ఫోరంలో ఆప్, కాంగ్రెస్ల మధ్య సీట్ల షేరింగ్పై గురువారం ఒప్పందం కుదిరింది. ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్, ఆప్ల మధ్య నాలుగు-మూడు షేరింగ్తో ఒప్పందం కుదిరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్లోని 80 స్థానాలకు సమాజ్వాదిపార్టీ, కాంగ్రెస్ల మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు ఈ వార్త వెలువడటం గమనార్హం. ఈ ఒప్పందంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.