పాట్నా : లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ అధికారంలోకి వస్తే అగ్నివీర్ స్కీమ్ను రద్దు చేస్తామని ఆర్జేడి నేత తేజస్వియాదవ్ స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్ స్కీమ్లో పెన్షన్ సదుపాయం లేదు. అమరవీరుల హోదా లేదు. క్యాంటిన్ సదుపాయం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సైనికులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని ఈ స్కీమ్ని ‘ఇండియా’ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని హామీనిచ్చారు. అలాగే సైనిక నియామకాల్లో కూడా పాత పద్ధతినే అవలంబించనున్నట్లు తేజస్వియాదవ్ తెలిపారు. అగ్నివీర్ స్కీమ్ రద్దు గురించి సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం ఇటీవల హామీ ఇచ్చారు.