న్యూఢిల్లీ : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇరకాటంలో పడే అవకాశం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు గురువారం కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. మార్చి 16న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఇడి పంపిన ఎనిమిదో సమన్లకు కూడా కేజ్రీవాల్ హాజరుకాలేదు. దీంతో ఇడి మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు మోడీ ప్రభుత్వం ఇడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయోగిస్తోందని అన్నారు. ఇడి సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు.