ఎపి భవన్‌ విభజన – హోం శాఖ ఉత్తర్వులు

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ విభజన అంశం పరిష్కారమయ్యిందని తాజాగా హోం శాఖ బుధవారం అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్షన్‌- జీకి ఎపి, తెలంగాణ రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 11.536 ఎకరాలు కేటాయించారు. ఎపికి 5.781 ఎకరాలు ఉన్న గోదావరి బ్లాక్‌, స్వర్ణముఖి బ్లాక్‌, నర్సింగ్‌ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయింపుకు సంబంధించిన కేంద్రం ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించారు. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలను కేటాయించినట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

➡️