మహిళలపై దాడుల ఫిర్యాదులు యుపిలోనే అధికం

– ఈ ఏడాదిలో ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్‌కు 12,600 ఫిర్యాదులు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సిడబ్ల్యు)కు ఈ ఏడాది సుమారు 12,600 ఫిర్యాదులు అందాయి. దీంట్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఫిర్యాదులు నమోదయ్యాయి. ఎన్‌సిడబ్ల్యు రైట్‌ టు డిగ్నిటీ కింద ఎక్కువ ఫిర్యాదులు అందుకున్నట్లు డేటాలో వెల్లడించారు. దీంట్లో గృహహింస కాకుండా ఇతర వేధింపులు రానున్నాయి. ఇలాంటివి సుమారు 3,107 ఫిర్యాదులు ఉన్నట్లు ఎన్‌సిడబ్ల్యు డేటా ప్రకారం తెలుస్తోంది. వరకట్న వేధింపులు కింద నమోదైన ఫిర్యాదులు 1,957 ఉన్నాయి. వేధింపులు 817, మహిళల పట్ల పోలీసుల వైఖరిలో 518, అత్యాచారం కింద 657 ఫిర్యాదులు ఉన్నాయి. లైంగిక వేధింపుల కింద 493, సైబర్‌ క్రైం కింద 339, వెంబడించడం లాంటివి 345, హానర్‌ క్రైం కింద 206 ఫిర్యాదులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ నుంచి మొత్తం 6,470 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆ తరువాత స్థానంలో ఢిల్లీ నిలిచింది. ఢిల్లీలో 1,113, మహారాష్ట్రలో 762, బీహార్‌లో 584, మధ్యప్రదేశ్‌లో 514, హర్యానాలో 506, రాజస్థాన్‌లో 408, తమిళనాడులో 301, పశ్చిమ బెంగాల్‌లో 306, కర్ణాటకలో 305 ఫిర్యాదులు నమోదయ్యాయి. 2023లో 28,811 ఫిర్యాదులను ఎన్‌సిడబ్ల్యు రిజిస్టర్‌ చేసింది.

➡️