ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి సమన్లు జారీచేసింది. కేజ్రీవాల్కు ఇప్పటి వరకు ఈడీ ఐదోసారీ సమన్లు ఇచ్చింది. లిక్కర్ కేసులో మొదటిసారి ఆయన నవంబర్ 2వ తేదీన సమన్లు ఇచ్చింది.. డిసెంబర్ 21న రెండోసారి, జనవరి 3వ తేదీన మూడోసారి, జనవరి 13వ తేదీన నాలుగోసారి సమన్లు జారీ చేసింది. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, అందుకోసం లిక్కర్ స్కామ్ని సాకుగా చూపిస్తున్నారని ఈడీపై ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై దాడి చేసేందుకే ఈడిని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా ఐదోసారి నేడు జారీ చేసిన సమన్లలో ఫిబ్రవరి 2వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ కోరింది. ఈసారి గనుక ఆయన హాజరు కాకుంటే.. అరెస్ట్ వారెంట్ కోసం ఈడీ కోర్టును ఆశ్రయించ్చే అవకాశం ఉంది.