అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి : ప్రధాని మోడి

May 7,2024 08:46 #Gujarat, #PM Modi, #vote

అహ్మదాబాద్‌ : అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి మోడి అన్నారు. మంగళవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న పాఠశాలలో మోడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం ప్రధాని మోడి మీడియాతో మాట్లాడుతూ … అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎండల్లోనూ ప్రజలు తరలివచ్చి ఓటు వేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందన్నారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల వేళ ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలని ప్రధాని మోడి సూచించారు.

➡️