చెన్నై : ఆదాయ పన్ను శాఖ (ఐటి) కాంగ్రెస్కు ఇచ్చిన నోటీసులు దేశంలోని అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజలకు ఇచ్చిన అతిపెద్ద హెచ్చరిక అని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలను నాశనం చేయడమే బిజెపి ఉద్దేశమని అన్నారు. శనివారం పుదుకొట్టాయ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎలక్టోరల్ బాండ్లతో కాషాయ పార్టీ రూ.8,250 కోట్లు దోచుకున్నప్పటికీ.. బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్పై రూ.135 కోట్ల జరిమానా విధించిందని అన్నారు. బిజెపి అన్ని పార్టీలను నాశనం చేయాలనుకుంటుందని, రాజకీయ పార్టీలకు, ప్రజలకు ఇది ఓ హెచ్చరిక అని అన్నారు.
ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే దేశం ఒకే పార్టీ తప్ప మరోకటి కాదు. ఈ హెచ్చరిక ప్రతి ఒక్కరిక వర్తిస్తుందని, ప్రజలు త్వరలోనే గుర్తిస్తారని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత అన్నాడిఎంకె ఎన్డిఎ కూటమిలో చేరుతుందని ప్రకటించారు.