న్యూఢిల్లీ : తన అరెస్టును సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది.
ఏప్రిల్ 1న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ జ్యుడీషియల్ రిమాండ్ కూడా ఏప్రిల్ 15తో ముగియనుంది.
ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిందిగా కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఎ.ఎం. సింఘ్వీ, షాదన్ ఫర్సాత్లు ఈ నెల 10 సుప్రీంకోర్టును ఆశ్రయించారు.