నితిన్ గడ్కరిని కలిసిన లోక్ సభ సభ్యులు కృష్ణ ప్రసాద్

Jun 29,2024 10:28 #Delhi, #Nitin Gadkari

ఢిల్లీ : కేంద్ర రోడ్లు, రవాణా, రహదారులు మంత్రి నితిన్ గడ్కరిని బాపట్ల లోక్ సభ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా  బాపట్ల నుండి విజయవాడ వరకు గల 65 కిలోమీటర్ల రాష్ట్ర రహదారి-40ను జాతీయ రహదారిగా మార్చాలని కోరుతూ కృష్ణ ప్రసాద్ గడ్కరికి వినతి పత్రం ఇచ్చారు. తద్వారా నిజాంపట్నం పోర్ట్, సెజ్, బాపట్ల & చీరాల బీచ్ లు, చీరాలలోని టెక్స్టటైల్ పార్క్ కు మరియు బాపట్లలో ఏర్పాటు కాబోవు ఐటి హబ్ – బయోటెక్ సిటీకి కనెక్టివిటీ పెరుగుతుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు.

➡️