పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి సుభాష్

Jul 1,2024 14:40 #Konaseema

అతిసారపై పోస్టర్లు విడుదల

ప్రజాశక్తి-రామచంద్రపురం : తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమలు చేస్తున్న కొత్త పింఛన్ విధానాన్ని సోమవారం ఉదయం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కే గంగవరం మండలంలోని పాణింగపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్లు రూ 7 వేలు ఒకేసారి అందజేస్తున్నామన్నారు.వృద్ధులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత, కల్లుగీత కార్మికులకు అందరికీ పెంచిన పింఛన్లు అందుతాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఆయన వెంట కే గంగవరం మండల అధ్యక్షులు పంపన నాగమణి, మండల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో వైద్య శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అతిసార వ్యాప్తిపై నిర్వహించడానికి తీసుకునే చర్యలపై ముద్రించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.

➡️