మోడీ పదేపదే అబద్ధాలు చెబుతున్నారు

May 3,2024 02:28 #coments, #Kharge, #PM Modi
  •  ప్రధాని వ్యాఖ్యలపై ఖర్గే

మోడీ తన ప్రసంగాల్లో పదేపదే అబద్ధాలు చెబుతున్నారని, అసత్యాలు వెయ్యిసార్లు పలికినా నిజాలు కావని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. గురువారం ఆయన మోడీకి రాసిన లేఖను ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ప్రధాని హోదాకు తగినట్టుగా భాష మాట్లాడాలని సూచించారు. మోడీ, బిజెపి నేతలు నిరాశ, నిస్పృహలో ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ అవినీతి, అబద్ధాలు, మాపియా, కుటుంబపాలన, ఓటు బ్యాంక్‌ రాజకీయాలు అనే వాటిపై నడుస్తోందన్న మోడీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 1947 నుంచి రిజర్వేషన్లను వ్యతిరేకించేది ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపినే అని అందరికీ తెలుసన్నారు. ఆర్టికల్‌ 16 ప్రకారం జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. మీ విధానాలు, ప్రచార ప్రసంగాల పట్ల ప్రజలు ఉత్సాహంగా లేరని ఆయన తెలిపారు. పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై మాట్లాడకుండా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఖర్గె విమర్శించారు. గత పదేళ్లలో మీ ప్రభుత్వ పనితీరుపై ఓట్లు అడగాలని ఆయన కోరారు. మీ నాయకులు మహిళలపై చేస్తున్న అకృత్యాలపై మాట్లాడాలన్నారు. మా మేనిఫెస్టోను యువత, మహిళలు, రైతులు, కార్మికులు పేదవారికి న్యాయం చేయడానికే తయారు చేశామని ఆయన పేర్కొన్నారు.

➡️