సార్వత్రిక ఎన్నికల తొలిదశలో కొనసాగుతున్న పోలింగ్‌ ..

Apr 19,2024 13:32 #Lok Sabha elections, #phase 1

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ కొనసాగుతోంది. తొలి దశలో మొత్తం 102 లోక్‌సభ స్థానాలతోపాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల్లోని ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.
ఇన్నర్‌ మణిపూర్‌ నియోజకవర్గంలో ఉద్రిక్తత చెలరేగింది. మొయిరాంగ్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని థమన్‌పోక్పి వద్ద దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. దీంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఇంఫాల్‌ తూర్పుజిల్లాలోని దోంగ్జు అసెంబ్లీ స్థానం పరిధిలోని పోలింగ్‌ స్టేషన్‌లోనూ విధ్వంసం జరిగినట్లు తెలుస్తోంది.

సమాచారం ప్రకారం  ఉదయం 11 గంటల వరకు  నమోదైన పోలింగ్

➡️