లాతూర్ : ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే తమ ప్రభుత్వం అంతమొందించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మహారాష్ట్రలోని లాతూర్లో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించిందని అన్నారు. దేశాన్ని సురక్షితంగా, భద్రంగా తమ ప్రభుత్వమే ఉంచగలదని చెప్పారు. ఉగ్రవాదుల కోసం కాంగ్రెస్లా తమ ప్రభుత్వ పత్రాలను పంపదని, వారి ఇళ్లలోనే హతమారుస్తుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేస్తుందని హెచ్చరించారు. షోలాపూర్కు నీటిని తెస్తానని వాగ్దానం చేసిన శరద్పవార్ ఏమీ తేలేదని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పవార్ పనిచేసినా రాష్ట్రానికేమీ చేయలేదని చెప్పారు.