Petrol: రాజస్థాన్‌లో 48గంటల పాటు పెట్రోల్ బంకులు బంద్

Mar 10,2024 12:04 #bundh, #petrol bunk, #Rajasthan

రాజస్థాన్‌లో రాష్ట్ర పెట్రోల్‌ పంపుల సంఘం సమ్మెను ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని పెట్రోల్ బంకులు రెండు రోజులు మూతపడనున్నాయి. మార్చి 10వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమ్మె మార్చి 12వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 6827 పెట్రోల్‌ బంకులను మూసివేస్తున్నట్లు రాష్ట్ర పెట్రోల్‌ పంపుల సంఘం ప్రకటించింది. 48 గంటలపాటు సమ్మె కారణంగా డీజిల్, పెట్రోల్ కొనుగోలు, అమ్మకాలు జరగడం లేదు. వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) రేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పంప్ ఆపరేటర్ల ఈ సమ్మె చేస్తున్నారు. పెట్రోల్‌ పంపుల సంఘం సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె వల్ల తమ పనులపై ప్రభావం పడుతుందని, పనులకు రాలేకపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. వీలైనంత త్వరగా పెట్రోల్‌ పంపు తెరవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️