లక్నో : లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాకుండా.. ఆయన బావ (ప్రియాంక భర్త) రాబర్ట్ వాద్రా పోటీ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. దాదాపు అమేథీ స్థానం నుంచి రాబర్ట్ వాద్రా పోటీ చేయడం ఖరారైనట్టు తెలుస్తోంది. సోమవారం రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నా, పాల్గొనలేకపోయినా.. దేశం కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తా. నేను అమేథీ నుంచి పోటీ చేయాలని చర్చలు జరుగుతున్నాయి. నేను ప్రజల సమస్యల్ని వినాలని కోరుకుంటున్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. నేను కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నా. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతం తొందరపడటం లేదు. ఇండియా బ్లాక్ని గెలిపించేందుకు రాహుల్, ప్రియాంక చాలా కష్టపడుతున్నారు. రాబోయే కాలంలో దేశంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. దేశాన్ని సెక్యులర్గా ఉంచుతాం’ అని ఆయన అన్నారు. అమేథీ, రారుబరేలీ అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించక పోవడం గమనార్హం.