- దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు రూ.1,39,750 కోట్లు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.5,655.72 కోట్లు విడుదలైంది. తెలంగాణకు రూ.2,937.58 కోట్లు విడుదలైంది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ నిధులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటా కింద రూ.1,39,750.92 కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ.25,066.88 కోట్లు, బీహార్కు రూ.14,056.12 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.10,970.44 కోట్లు, పశ్చిమబెంగాల్కు రూ.10,513.46 కోట్లు విడుదలయ్యాయి.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇప్పటి వరకు రూ.2,79,500 కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.