Bengaluru: జగదీష్‌ హోటల్‌ రూమ్‌లో ఉజ్బెకిస్తాన్‌ మహిళ మృతి

Mar 14,2024 17:50 #Bengaluru, #Murder, #Uzbekistan Woman

బెంగళూరు : బెంగళూరులోని జగదీష్‌ హోటల్‌ రూమ్‌లో ఉజ్బెకిస్తాన్‌ మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ హోటల్‌కి చేరుకుని పరిశీలించారు. హోటల్‌ గదిని పరిశీలించిన తర్వాత ఆమెను హత్య చేసిన ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జరీనా (37 ఏళ్ల) నాలగురోజుల క్రితం టూరిస్ట్‌ వీసాపై బెంగళూరుకి చేరుకుంది. శేషాద్రిపురం ప్రాంతంలోని జగదీష్‌ ఘోటల్‌లో ఒక రూమ్‌లో బస చేసింది. నిన్న (బుధవారం) మధ్యాహ్నం 4.30 గంటలకు హోటల్‌ సిబ్బంది జరీనా రూమ్‌ డోర్‌ తట్టారు. ఆమె డోర్‌ తీయకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి మరో కీతో డోర్‌ తెరచి చూశారు. బెడ్‌పై జరీనా మృతదేహాన్ని చూసి హోటల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు హోటల్‌కి చేరుకుని జరీనా ఉన్న గదిని పరిశీలించారు. ఈ హత్యకు సంబంధించి ఆధారాల కోసం ఫోరెన్సిక్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. జరీనాను ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు బుధవారం జరీనా గదిలోకి ఎవరెవరు వెళ్లారో తెలుసుకునేందుకు హోటల్‌లోని సిసిటీవీ ఫుటేజ్‌ని, రిజిస్టర్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని బౌరింగ్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️