ప్రజాశక్తి-గాజువాక(విశాఖ) : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లు పై వైసీపీ సిద్ధం స్ట్రిక్కెర్స్ ఉండటంతో వాటిని అధికారులు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అగనంపూడి టోల్ గేట్ సమీపంలో ప్లేయింగ్ స్కాడ్ తనిఖీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ కార్లు మంత్రి దాడిశెట్టి రాజావిగా సమాచారం.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/car-1.jpg)