ఏపీ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలును ప్రారంభించిన పురంధేశ్వరి

Feb 7,2024 14:40 #guntur, #opened, #special trains

అమరావతి : ఏపీలోని గుంటూరు రైల్వేస్టేషన్‌లో గుంటూరు నుంచి అయోధ్యకు వెళ్తున్న ప్రత్యేక రైలును ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌, తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ నుండి అయోధ్యకు వెళుతున్న మొదటి రైలు ఇదేనని.. వేలాది మంది యాత్రికులను అయోధ్యకు పంపిస్తున్న పుణ్యం ఏపీకి దక్కుతుందన్నారు. చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో మాకు తెలియదన్నారు. ఎప్పుడు, ఎవరితో భేటీ అవ్వాలో పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో బీజేపీ అగ్రనాయకత్వం చూసుకుంటుందని ఆమె వెల్లడించారు.జాతీయ స్థాయిలో జరిగే వ్యవహారాలపై మాకు అవగాహన ఉండదు. అలాంటి విషయాలపై స్పందించడం సరికాదు. కొన్ని పరిమితులు ఉంటాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరే చూస్తారని ఆయన మీడియాతో వెల్లడించారు. తినబోతూ రుచి అడగవద్దన్నారు. జరుగుతున్న ప్రచారాలు చూస్తే , మూడు నాలుగు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుందన్నారు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజా కంటక పాలన అంతం అవ్వాలి, ఆ నినాదంతోనే రాష్ట్ర బీజేపీ నాయకత్వం పనిచేస్తుందన్నారు.

➡️