తెలంగాణ : హైదరాబాద్లోని ఔటర్ రింగు రోడ్డు వద్ద ఓ మూటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధి బ్రహ్మణపల్లి సమీపంలో గోనె సంచిలో వ్యక్తి మృతదేహాన్ని మూటకట్టి ఓఆర్ఆర్ పైనుంచి దుండగులు పడేశారు. గోనె సంచి నుంచి దుర్వాసన రావడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.