హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. గాంధీభవన్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప్దాస్ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు.