కొడంగల్‌ నియోజకవర్గంలో మొరాయిస్తున్న ఈవీఎం.. నిలిచిపోయిన పోలింగ్‌

Nov 30,2023 15:00 #EVM is barking, #Polling, #stalled

కొడంగల్‌: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్న వేళ పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు అధికారులను టెన్షన్‌ పెడుతోంది. తాజాగా కొడంగల్‌ నియోజకవర్గంలో ఓ ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.వికారాబాద్‌ జిల్లా బమ్రాస్‌ పేట మండలంలోని తుంకిమెట్ల 194 పోలింగ్‌ స్టేషన్లో అరగంటకుపైగా ఈవీఎం మొరాయిస్తోంది. దీంతో పోలింగ్‌ నిలిచిపోయింది. క్యూలైన్లో నిల్చోవడంపై పలువురు అసహనంగా ఉన్నారు. త్వరగా సమస్య పరిష్కరించి పోలింగ్‌ మళ్లీ ప్రారంభించాలని కోరుతున్నారు.అసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 189 లో రెండు గంటలుగా ఈవీఎం మొరాయించడంతో పోలింగ్‌ నిలిచిపోయింది. అలాగే కాగజ్‌ నగర్‌ పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 63లో కూడా సాంకేతిక సమస్యతో రెండు గంటలుగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో ఓటర్లు వెనుదిరుగుతున్నారు.

➡️