జగన్‌ పాలన ఎక్స్‌పైరీ డేట్‌ 3 నెలలు మాత్రమే : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

Nov 24,2023 11:27 #cm jagan, #Comments, #Nara Lokesh

అమరావతి : ” జగన్‌ పాలన ఎక్స్‌పైరీ డేట్‌ 3 నెలలు మాత్రమే. మూడు నెలల ముచ్చట కోసం వేల కోట్లు తగలేస్తున్నారు ” అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు ఎపి సిఎం జగన్‌ జిఒ లు ఇస్తున్నారని అన్నారు. టిడిపి ప్రభుత్వం అమరావతిలో సెక్రటేరియట్‌ కట్టిందని.. అందులో కూర్చుని జగన్‌ ఇదేం రాజధాని అని అంటున్నారని విమర్శించారు. ఐటి అభివృద్ధికి కట్టిన మిలీనియం టవర్స్‌ను ఖాళీ చేయిస్తున్నారని, వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీలను తరిమేస్తున్నారని అన్నారు. రుషికొండను ధ్వంసం చేశారని అన్నారు. కైలాసగిరిని నాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్‌ పాలన ఎక్స్‌పైరీ డేట్‌ 3 నెలలు మాత్రమేనని… మూడు నెలల ముచ్చట కోసం వేల కోట్లు తగలేస్తున్నారు అని లోకేశ్‌ మండిపడ్డారు.

➡️